ఇండోర్ : ఓ కుక్కను పోలీసులు అరెస్టు చేశారు. అవును మీరు చదివింది నిజమే.. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు శునకంతో పాటు దాని యజమానిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వింత ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి భారీగా పెరుగుతున్నది. దీంతో మహమ్మారి కట్టడికి పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకురాగా.. పలు రాష్ట్రాలు లాక్డౌన్ విధించాయి.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం సైతం నైట్కర్ఫ్యూను అమలు చేసున్నది. ఈ క్రమంలో ఇండోర్లోని పలాసియా ప్రాంతంలో ఓ వ్యాపారవేత్త తన పెంపుడు కుక్కను తీసుకొని బయటకు తీసుకువచ్చాడు. ఆ సమయంలో కొవిడ్ కర్ఫ్యూను అమలు చేసేందుకు పోలీస్ బృందం పెట్రోలింగ్ గమనించి.. కుక్కతో పాటు యజమానిని అదుపులోకి తీసుకొని జైలుకు పంపారు. అయితే, అరెస్టును పోలీసులు ఖండించగా.. కుక్క అరెస్టుపై జంతు ప్రేమికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ అరెస్టు వార్త సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది.