SIRICILLA | సిరిసిల్ల కలెక్టరేట్, ఏప్రిల్ 3 : భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన యోధుడు దొడ్డి కొమురయ్య అని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. కలెక్టరేట్ లో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా అధికారులు ముఖ్య అతిథిగా హాజరై దొడ్డి కొమురయ్య చిత్ర పటానికి కలెక్టర్ తో కలిసి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూమి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన దొడ్డి కొమురయ్య పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాల్సిన అవసముందని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రాజ మనోహర్, బీసీ నాయకులు, గొల్ల, కురుమ సంఘాల నాయకులు, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.