హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఎన్నారై యూకే విభాగం లండన్లోని భారత హైకమిషన్ ముందు మహాధర్నా నిర్వహించింది. అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి మాట్లాడుతూ.. పంజాబ్లో కొన్నట్టు తెలంగాణలోనూ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎన్నారై లండన్ ఇన్చార్జి నవీన్, కార్యదర్శి సత్య, అధికారప్రతినిధి రవిప్రదీప్ రాజు, కోర్ కమిటీ సభ్యులు రావుల పృథ్వీ, మధు పాల్గొన్నారు. అనంతరం హైకమిషన్ ప్రతినిధికి వినతిపత్రం అందజేశారు.