హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): అనారోగ్యం కారణంగా సెలవు పెట్టిన డీజీపీ ఎం మహేందర్రెడ్డి శనివారం తిరిగి విధుల్లో చేరారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలోనూ ఆయన పాల్గొన్నారు. ఇంట్లో జారిపడటంతో ఎడమ భుజం ఎముకలో మూడు చోట్ల హెయిైర్లెన్ ఫ్యాక్చర్లు కావడంతో వైద్యుల సలహా మేరకు విశ్రాంతి కోసం మహేందర్రెడ్డి ఫిబ్రవరి 18 నుంచి శుక్రవారం వరకు సెలవు పెట్టారు.
పదోన్నతులపై డీజీపీకి పోలీస్ అధికారుల సంఘం వినతి
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న హెడ్కానిస్టేబుల్ పదోన్నతులు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం డీజీపీ మహేందర్రెడ్డిని కోరింది. ఈ మేరకు శనివారం డీజీపీకి వినతిపత్రం సమర్పించినట్టు ఆ సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి తెలిపారు. మ్యూచువల్ బదిలీలకు అవకాశం కల్పించాలని కోరినట్టు పేర్కొన్నారు.