హైదరాబాద్ : గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం బంజారాహిల్స్లో నూతనంగా నిర్మించిన బంజారా భవన్, ఆదివాసీ భవన్ లను మంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ల అమలు కోసం తీర్మానం చేసి పంపినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం స్థలం కేటాయించినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు.
గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్, ఆదివాసీల పోరాట యోధుడు కుమ్రం భీమ్ల స్మారక భవనాలను సీఎం కేసీఆర్ త్వరలోనే ప్రారంభిస్తారన్నారు. దేశంలో ఎక్కడ ఇలాంటి అద్భుతమైన భవనాలు నిర్మించలేదన్నారు. ముఖ్యమంత్రి గిరిజనుల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోతారని ఆయన తెలిపారు.