నల్లబెల్లి, జనవరి 28 : రూ.150 కోట్ల వ్యయంతో నియోజకవర్గంలో అంతర్గత రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. మండలంలోని రుద్రగూడెంలో రూ. 40 లక్షలతో సీసీ రోడ్లు పనులను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు పల్లెల అభివృద్ధిని పట్టించుకున్న దాఖాలాలు లేవని, దీంతో అంతర్గత, లింకు రోడ్లు వర్షాకాలంలో పూర్తిగా బురదమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారని పేర్కొన్నారు. ప్రజల సౌకర్యార్థం వంద శాతం సీసీ రోడ్లున్న నియోజకవర్గంగా నర్సంపేటను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. మండలంలో రూ.4.67 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఎక్కడైనా సీసీ రోడ్లు లేని గ్రామం ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలాగే రంగాయ, పాకాల, మాదన్నపేట చెరువుల్లోకి గోదావరి జలాలను తరలించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఆయకట్టు రైతులు అధైర్యపడకుండా యాసంగి వరి నాట్లు వేసుకోవాలని సూచించారు. అనంతరం రామప్ప పంప్ హౌజ్ వద్ద ఇరిగేషన్ సర్క్యూట్ మోటర్లను పరిశీలించారు. కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, ఎంపీపీ ఊడుగుల సునీత, సర్పంచ్ మల్లాడి కవిత, వైస్ ఎంపీపీ గందె శ్రీలత, బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఊడుగుల ప్రవీణ్గౌడ్, మాజీ ఎంపీపీలు బానోత్ సారంగపాణి, కక్కెర్ల శ్రీనివాస్గౌడ్, సర్పంచ్లు చింతపట్ల సురేశ్రావు, మామిండ్ల మోహన్రెడ్డి, అమరేందర్రెడ్డి, తిరుపతి, నాయకులు పాలెపు రాజేశ్వర్రావు, హింగ్లి శివాజీ, మాజీ సర్పంచ్ విడియాల ప్రభాకర్రావు, అంబరగొండ రాజు తదితరులు పాల్గొన్నారు.
పాకాల రంగాయ చెరువు ప్రాజెక్టు పరిశీలన..
నర్సంపేట : పాకాల రంగాయ చెరువు ప్రాజెక్టు (ములుగు పంప్హౌజ్)ను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి శనివారం పరిశీలించారు. ఖానాపురం, నల్లబెల్లి మండలాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధు లు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే ప్రాజెక్టును సందర్శించారు. రంగాయ, పాకాల, మాదన్నపేట చెరువులను నింపే ఇరిగేషన్ సర్క్యూట్ మోటర్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సీఈ విజయభాస్కర్, ఈఈ వెంకటకృష్ణారావు, డీఈ యశ్వంత్, ఖానాపురం ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, నాయకులు బత్తిని శ్రీనివాస్, ఉపేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.