బెంగళూరు : రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని కావాలన్న భర్త అత్యాశ, బెట్టింగ్ వ్యసనం కర్ణాటకలో ఒక భార్య ఉసురు తీసింది. ఐపీఎల్ బెట్టింగ్లో భర్త చేసిన అప్పులు తీర్చమని అప్పులవాళ్ల వేధింపులు భరించలేక 23 ఏండ్ల రంజిత ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హోసదుర్గలో మైనర్ ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేసే దర్శనబాబుకు 2020లో రంజితతో పెండ్లి అయ్యింది. వారికి రెండేండ్ల కుమారుడు సంతానం.