న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి వారణాసి మధ్య హై స్పీడ్ రైల్వే కారిడార్ నిర్మాణానికి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఆ రూట్లో ఎక్కువ సంఖ్యలో మలుపులు ఉన్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వలేమని రైల్వే బోర్డు పేర్కొన్నది. మలుపుల వల్ల రైలు ఆ రూట్లో 350 కిలోమీటర్ల వేగంతో వెళ్లడం సాధ్యం కాదు అని బోర్డు అభిప్రాయపడింది. బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై గత వారం జరిగిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే బోర్డు కార్యదర్శి ఆర్ ఎన్ సింగ్ తెలిపారు. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నివేదికను తయారు చేసింది. జాతీయ రహదారి-2 వెంట బుల్లెట్ రైలు కారిడార్ను నిర్మించాలని భావించారు. ఆ రూట్లో అయితే తక్కువ ధరకే భూమిని కొనుగోలు చేయవచ్చు అని, దాని వల్ల ప్రాజెక్టు ధర తగ్గుతుందని అంచన వేశారు. 350 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ రైలును నడపాలంటే, ఆ ట్రాక్ స్ట్రెయిట్గా ఉండాలని బోర్డు తెలిపింది.