అమరావతి : ఏలూరు జిల్లా భీమడోలు పీఎస్లో నిందితుడు అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. గొలుసు చోరీల కేసులో సూరప్పగూడేనికి చెందిన అప్పారావు అనేవ్యక్తిని మూడు రోజుల క్రితం అరెస్టు చేసి స్టేషన్కు తీసుకొచ్చారు. అయితే తాను బాత్రూంకు వెళతానని చెప్పడంతో పోలీసులు అతడిని బాత్రూంకు పంపించారు.
ఎంతకీ తిరిగి రాకపోవడంతో బాత్రూంకు వెళ్లి చూడగా అతడు ఊరివేసుకున్నాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోలీసులు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.