హైదరాబాద్ : కరోనా టీకాల విషయంలో భారత్ బయోటెక్ మరో ముందడుగు వేసింది. 2-18 వయస్కులపై టీకా క్లినికల్ ట్రయల్స్కు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. సబ్జెక్ట్ నిపుణుల కమిటీ (ఎస్ఈసీ) సిఫారసు మేరకు ఫేజ్-2, ఫేజ్-3 ట్రయల్స్ నిర్వహణకు అనుమతులు జారీ చేసింది. 252 మంది వలంటీర్లపై భారత్ బయోటెక్ కంపెనీ ట్రయల్స్ నిర్వహించనుంది. ట్రయల్స్లో భాగంగా 28 రోజుల్లోపు రెండు డోసుల వ్యాక్సిన్ను వేయనున్నారు. వ్యాక్సిన్ ట్రయల్స్ ఢిల్లీ, పాట్నా ఎయిమ్స్, నాగాన్పూర్ మెడిట్రినా సంస్థలో జరుగనున్నాయి. ఇదిలా ఉండగా.. కంపెనీ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ను 18 ఏళ్లు పైబడిన వ్యక్తులకు ఇచ్చేందుకు డీసీజీఐ ఇంతకు ముందే అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా టీకా డ్రైవ్లో కొవాగ్జిన్ను వినియోగిస్తున్నారు.