హైదరాబాద్ : రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, సీఎం రేవంత్ ఎస్సీ, ఏస్టీ రిజర్వేషన్లు తీసేస్తారని అంటున్నారు. మరో వైపు బీజేపీ వాళ్లు కాంగ్రెస్ వస్తే రిజర్వేషన్లు(Reservations) రద్దు చేసి ముస్లింలకు ఇస్తారని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. రిజర్వేషన్లు తీసే హక్కు ఎవరికి లేదని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్(Vinod Kumar) అన్నారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని దళిత సంఘాలు వినోద్ కుమార్ క్యాంపు కార్యాలయంలో కలిసి పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా నిర్మాణం చేసిన సెక్రటేరియట్కు అంబేద్కర్ పేరు పెట్టడంతో పాటు,125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు.
రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కులని, వాటిని రద్దు చేసే హక్కు ఎవరికి లేదని పేర్కొన్నారు. వీటిని ముట్టరాదని 2006లో సుప్రీంకోర్టు జడ్జి తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాజకీయాల కోసమే(Parliament eletions) ఈ ప్రస్తావన తెస్తున్నాయని మండిపడ్డారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు నన్ను ఎంపీగా గెలిపించాలని..ప్రతి సమస్యపై పార్లమెంట్లో ప్రశ్నించే గొంతు కనవుతానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి మహేష్, వంతడుపుల సంపత్, సాంబారి కొమురయ్య, క్యాదాసు ప్రభాకర్, బీమారపు సతీష్, పారునంది జలపతి పాల్గొన్నారు.