Loksabha Elections 2024 : కాంగ్రెస్ ఎంపీ, లోక్సభ ఎన్నికల్లో వయనాద్ (కేరళ), రాయ్బరేలి (యూపీ) నుంచి పోటీ చేస్తున్న రాహుల్ గాంధీ సోమవారం రాయ్బరేలిలో పర్యటించారు. రాయ్బరేలిలోని ఓ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు.
రాహుల్ రాకతో పోలింగ్ కేంద్రం వద్ద కోలాహలం నెలకొంది. ప్రజలు పెద్దసంఖ్యలో గుమికూడి రాహుల్తో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ కంచుకోటగా పేరొందిన రాయ్బరేలిలో రాహుల్ గాంధీ విజయం కోసం ఆ పార్టీ శ్రేణులు చెమటోడ్చారు.
#WATCH | Congress MP and candidate from Wayanad (Kerala) and Raebareli (Uttar Pradesh) Rahul Gandhi, arrives at a polling booth in Raebareli, Uttar Pradesh to inspect it. pic.twitter.com/nwpsks2oCP
— ANI (@ANI) May 20, 2024
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ సైతం ప్రచారానికి వచ్చి తన కొడుకును రాయ్బరేలి ప్రజలకు అప్పగిస్తున్నానని, మీకోసం ఇక రాహుల్ పనిచేస్తారని పేర్కొన్నారు.
Read More :
Uttar Pradesh | యూపీ వాసి ఖాతాలో 9,900 కోట్లు జమ!