Loksabha Elections 2024 | బాలీవుడ్ మిస్టర్ ఫర్పెక్ట్ అమీర్ ఖాన్ తన మాజీ భార్య కిరణ్ రావుతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. లోక్సభ ఎన్నికల(Lok Sabha Elections)లో భాగంగా సోమవారం ఐదో దశ పోలింగ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఐదో దశలో ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ముంబైలో కూడా నేడు పోలింగ్ జరుగుతుండగా.. పెద్దసంఖ్యలో సామాన్యులు, సెలబ్రిటీలు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇదిలావుంటే తాజాగా బాలీవుడ్ నటుడు మిస్టర్ ఫర్పెక్ట్ అమీర్ ఖాన్ తన ఓటు వినియోగించుకున్నాడు. మాజీ భార్య కిరణ్ రావుతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన అమీర్ ఖాన్ ఓటు వేసిన అనంతరం తమ వేలికి ఉన్న ఇంక్ గుర్తును ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆయన అభ్యర్థించారు.
అమీర్ ఖాన్, కిరణ్ రావు గతేడాది విడిపోయిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాల వలన విడిపోయిన ప్రస్తుతం ఒకే ఇంట్లో కలిసి నివాసం ఉంటున్నారు. సినిమాల విషయానికి వస్తే.. అమీర్ ఖాన్ ప్రస్తుతం సితారే జమీన్ పర్ అనే సినిమా చేస్తుండగా.. కిరణ్ రావు ఇటీవల లాపతా లేడిస్ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది.
#WATCH | Actor Aamir Khan and Kiran Rao show their inked finger after casting their votes at a polling station in Mumbai for the fifth phase of #LokSabhaElections2024 pic.twitter.com/u1vh3pBcEU
— ANI (@ANI) May 20, 2024