హుజూరాబాద్ : దళితబంధు ఎన్నికలకు ముందే కేసీఆర్ గారి ఆలోచనలో ఉన్న పథకం అని ముందే చెప్పారు. ఈ ఎన్నికల్లో ఎస్సీల ఓట్లు పొందాలనే ఆలోచనతో చేసిన పథకం కాదు. దానికోసం ముఖ్యమంత్రి పలువురు ఐఏఎస్ అధికారులతో చర్చించినట్టు కూడా తెలిపారు.
దళితబంధు పదిలక్షలు అనేది కేవలం మా ఎస్సీకాలనీ అని కాదు దళితజాతి అంతా గర్వించదగిన పథకం. అందరూ హర్షిస్తున్నారు. ఈటెల రాజేందర్ గారు రెండు రోజుల క్రితం దళితబంధు ఆపాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఆయన చేయలేదని దాటవేస్తున్నారు. ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.
సుద్దాల సంపత్ కుమార్, దళిత నాయకుడు, మామిడాల పల్లి (వీణవంక )