నస్రుల్లాబాద్, జూన్ 7: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి బీర్కూర్ మండలం కేంద్రానికి చెందిన ఓ యువకుడు రూ.లక్షా 15వేలు పోగొట్టుకున్నాడు. వివరాలు.. బీర్కూర్కు చెందిన మజార్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మే నెల 2వ తేదీన వాట్సాప్ గ్రూపుల్లో ఆర్టీవో చలాన్ లింక్ వచ్చింది.
మజార్ ఆ లింకును ఓపెన్ చేసి యాప్ అడిగిన వివరాలను నమోదు చేశాడు. జూన్ 3వ తేదీన మజార్ తన బ్యాంకు ఖాతాలో రూ.లక్షా 50వేలు డిపాజిట్ చేశాడు. జూన్ 6వ తేదీన సాయంత్రం ఆరు విడుతలుగా రూ.లక్షా 15వేల నగదును సైబర్నేరగాళ్లు కాజేశారు. బ్యాంకు నుంచి మెస్సేజ్లు రావడంతో వెంటనే బీర్కూర్ పోలీస్ స్టేషన్లో, 1930కు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.