చెరువులో చేపలు పట్టుకుందామని వెళ్లాడా వ్యక్తి. ఇటీవల ఆ చెరువు పక్కన కట్టిన ర్యాంప్పై కూర్చొని చేపలు పట్టుకుంటున్నాడు. అలాంటి సమయంలో సడెన్గా మీదకు దూకిన ఒక మొసలి.. అతని కాలు పట్టేసింది. అతన్ని నీళ్లలోకి లాక్కెళ్లేందుకు ప్రయత్నించింది. ఎలాగోలా తప్పించుకున్న అతన్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటన ముంబైలోని పావాయి లేక్ ప్రాంతంలో వెలుగు చూసింది. ఈ చెరువుకు సమీపంలో ఉండే ఒక ఆదివాసీ తెగకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి.. చేపలు పట్టేందుకు చెరువు వద్దకువ వెళ్లాడు. అతనిపై మొసలి దాడి చేయడంతో ఘట్కోపర్లో ఉన్న రాజావాడి హాస్పిటల్కు తీసుకెళ్లినట్లు సమాచారం.
చెరువు గట్టున కట్టిన ర్యాంప్ వల్లనే అతని ప్రాణాలు దక్కాయని, లేదంటే మొసలి అతన్ని నీళ్లలోకి లాక్కెళ్లిపోయేదని స్థానికులు చెప్తున్నారు. బీఎంసీ అధికారులు ఈ ప్రాంతంలో మరిన్ని వార్నింగ్ బోర్డులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.