న్యూఢిల్లీ : దేశంలో టీకా డ్రైవ్ ముమ్మరంగా సాగుతున్నది. సోమవారం రికార్డు స్థాయిలో 86.29లక్షల మందికి టీకాలు వేసినట్లు కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా టీకా డ్రైవ్లో వేసిన టీకా మోతాదుల సంఖ్య 55 మార్క్ను దాటిందని పేర్కొంది. ఒకే రోజు 18-44 ఏజ్గ్రూప్లో 31,44,650 మందికి తొలి, 5,22,629 మందికి సెకండ్ డోసు అందజేసినట్లు చెప్పింది. మూడో దశ టీకా డ్రైవ్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 18-44 ఏళ్ల మధ్య 20,00,68,334 మంది మొదటి.. మరో 1,59,35,853 మంది రెండో మోతాదు వేసినట్లు పేర్కొంది. ‘కరోనా వైరస్పై భారతదేశ పోరాటాన్ని బలోపేతం చేద్దామని.. టీకా వేయించుకుందాం’ అని ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవ్య ట్వీట్ చేశారు. టీకా డ్రైవ్ సోమవారం నాటికి 213 నాటికి చేరగా.. మొత్తం 55,85,834 టీకా మోతాదులు వేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది.