నల్లగొండ : జిల్లాలోని అనుముల మండలం చింతగూడెం వద్ద ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాద విషాదం మరకముందే ఇటువంటి దుర్ఘటనే నిడమనూరు మండల కేంద్రంలో మరొకటి చోటుచేసుకుంది. గ్రామంలోని ప్రధాన రహదారిపై అదుపుతప్పిన లారీ.. బైక్తో పాటు ట్రాలీ ఆటోను ఢీకొట్టింది. దీంతో బైక్పై ప్రయాణిస్తున్న భార్యాభర్తలిద్దరూ సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. ఆటో డ్రైవర్తో పాటు మరో ఇద్దరు చిన్నారులకి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఉదయం చింతగూడెం వద్ద టిప్పర్ లారీ ఢీకొనడంతో బైక్పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు సంఘటనా స్థలంలోనే చనిపోయారు. వరుస రోడ్డు ప్రమాదాలతో సర్వత్రా విషాదం నెలకొంది.