హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 3 (నమస్తే తెలంగాణ)/మన్సూరాబాద్: హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నం వద్ద జరిగిన జంట హత్యలకు భూ వివాదమే కారణమని పోలీసులు తేల్చారు. చర్లపటేల్ గూడ పరిధిలో ఉన్న ఎవరికీ చెందని రూ.50 కోట్ల విలువైన 15 ఎకరాల భూమికోసం రియల్ ఎస్టేట్ వ్యాపారులు మీ రెడ్డి మట్టారెడ్డి, శ్రీనివాస్రెడ్డి మధ్య ఏర్పడిన వివాదమే హత్యలకు దారితీసిందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ గురువారం తెలిపారు. హత్యలకు దారితీసిన క్రమాన్ని ఎల్బీనగర్లోని రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆయన మీడియాకు వివరించారు. హైదరాబాద్లోని అల్మాస్గూడకు చెందిన శ్రీనివాస్రెడ్డి, అతని స్నేహితుడు రాఘవేంద్రరెడ్డి హ త్యలో మీరెడ్డి మట్టారెడ్డి ప్రధాన సూత్రధారి అని వెల్లడించారు. ఈ హత్యలకు పాల్పడ్డ ఆరుగురిని అరెస్టు చేశామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని చెప్పారు. నిందితుల నుంచి రెండు తుపాకులు, 19 క్యాట్రిడ్జిలు, 6 మొబైల్ ఫోన్లు, కారు, బుల్లెట్ వాహనాన్ని స్వాధీ నం చేసుకొన్నారు.
చైతన్యపురి ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యా పారి మీరెడ్డి మట్టారెడ్డికి కర్ణంగూడ, చర్లపటేల్ గూడ పరిధిలోని సర్వే నంబర్ 1369, 1370, 1371, 1372లోని 20 ఎకరాల లేక్ విల్లా ఆర్చిడ్స్ వెంచర్లో 4,444 గజాల ప్లాట్లు ఉన్నాయి. ఈ వెంచర్ పక్కనే అల్మాస్గూడకు చెందిన శ్రీనివాస్రెడ్డి, రాఘవేంద్రరెడ్డి 14.50 ఎకరాల స్థలాన్ని వ్యవసాయం కోసం లీజుకు తీసుకొన్నారు. లేక్ విల్లా ఆర్చిడ్స్లో 15ఎకరాల స్థలం అదనంగా ఉన్నదని గుర్తించిన శ్రీనివాస్రెడ్డి దానిని ఆక్రమించేందుకు ప్రయత్నించారు. ఆ భూమి కోసం మీరెడ్డి మట్టారెడ్డి కూడా పోటీకి రావటంతో గొడవలు మొదలయ్యాయి. దీంతో శ్రీనివాస్రెడ్డి, రాఘవేంద్రరెడ్డిని హత్యచేసేందుకు మట్టారెడ్డి తన గెస్ట్హౌజ్ వాచ్మెన్ ఖాజా మొయినుద్దీన్ నాయకత్వంలో బుర్రి భిక్షపతి, సయ్యద్ రహీం, సమీర్ అలీ, రాజుఖాన్, చంద న్ సిబన్, సోనుతో ముఠాను ఏర్పాటు చేసి బీహార్ నుంచి నాటు తుపాకులు తెప్పించారు. ఈ నెల 1న వెంచర్ వద్ద నుంచి బయలుదేరిన శ్రీనివార్రెడ్డి, రా ఘవేంద్రరెడ్డిపై మొయినుద్దీన్, బుర్రి భిక్షపతి కాల్పు లు జరపడంతో వారు మరణించారని సీపీ తెలిపారు.