సిటీబ్యూరో, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): మౌలిక సదుపాయాలు, అత్యుత్తమ పారిశ్రామిక విధానాలతో హైదరాబాద్కి అంతర్జాతీయ సంస్థలు క్యూ కడుతున్నాయని ఉత్తరాఖండ్ సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్ అనిల్ చంద్రపునీత్ అన్నారు. శ్రీను టెక్నాలజీ మొదటి వార్షికోత్సవాన్ని హైదరాబాద్లో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ‘శ్రీను టెక్నాలజీ’ అనతి కాలంలోనే డిజిటల్ రంగంలో నిలబడిందన్నారు. ఉమ్మడి ఏపీ అదనపు ప్రధాన కార్యదర్శి ఏఆర్ సుకుమార్ మాట్లాడుతూ ఇప్పటికే సాంకేతిక రంగం అనేక కొత్త పుంతలు తొక్కుతుందని.. భవిష్యత్లో చూపు లేని వారు కృత్రిమంగా చూసే పరిస్థితి రావడం ఖాయమన్నారు.ఈ కార్యక్రమంలో అపోలో హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ అడ్వైజర్ డాక్టర్ మోహన్ కృష్ణ, సీఏ సదాశివారెడ్డి, వ్యాపారవేత్త కేఈ హరిబాబు, శ్రీను టెక్నాలజీ ఎండీ చిల్కా కావ్యశ్రీ, ప్రతినిధులు జమాల్, మదులేటి మధురెడ్డి పాల్గొన్నారు.