ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ఆయన స్వీయ ఐసోలేషన్లో ఉంటున్నారు. కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ, ఎటువంటి తీవ్ర అనారోగ్య సమస్యలు లేవని సమాచారం. ఇటీవలి కాలంలో తనతో టచ్లో ఉన్నవాళ్లంతా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.