హైదరాబాద్: నగర శివార్లలోని రాజేంద్రనగర్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్ఐఆర్డీ పీఆర్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. నేషనల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ (ఎన్పీఎంయూ)లో భాగంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. ఎంపికైన అభ్యర్థులను కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించనున్నారు. ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, అగ్రికల్చర్ అండ్ అల్లైడ్ సెక్టార్స్, ఎడ్యుకేషన్, లైవ్లీహుడ్, పావర్టీ ఎలివేషన్ అండ్ ఇన్కమ్ జనరేషన్, వాష్ సెక్టార్ అండ్ హెల్త్, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఫైనాన్స్ మేనేజ్మెంట్, ఫిస్కల్ పాలసీ అడ్వకసీ, సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 11
ఇందులో కన్సల్టెంట్ 9, హిందీ ట్రాన్స్లేటర్ 2 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: అగ్రికల్చర్లో ఎమ్మెస్సీ, ఎమ్మెస్డబ్ల్యూ, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్లో పీజీ, బీస్సీ కంప్యూటర్స్, ఎంబీఏ, సీఏ, పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్, ఫిస్కల్ మేనేజ్మెంట్లో పీజీ, హిందీ లేదా ఇంగ్లిష్లో పీజీ చేసి ఉండాలి. అభ్యర్థులు 30 నుంచి 50 ఏండ్ల మధ్య వయస్కులై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తులకు చివరితేదీ: మే 30
వెబ్సైట్: http://career.nirdpr.in/
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి