హైదరాబాద్ : లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. గురువారం నగరంలోని మియాపూర్ పరిధిలో లాక్డౌన్ అమలు తీరును సమీక్షించారు.
జేపీనగర్, చందానగర్ తారానగర్ మార్కెట్లతోపాటు రాజీవ్ గృహకల్ప కాలనీల్లో పర్యటించి పోలీసులు లాక్డౌన్ అమలు చేస్తున్న తీరు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల సహకారంతోనే కరోనా కట్టడి సాధ్యమని, ప్రతి ఒక్కరూ ఇందుకు సహకరించాలని కోరారు. లాక్డౌన్ సమయంలో వాహనదారులు రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.