వరంగల్,జూన్ 13 : వరంగల్ నగరంలోని భద్రకాళీ ఆలయంలో ఈ నెల 17న నూతన ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించనున్నట్లు ఈవో రామల సునీత తెలిపారు. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న నేపథ్యంలో కొత్తది ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం నుంచి ఆలయంలో ప్రతిష్ఠయాగం ప్రారంభిస్తామన్నారు.
17న ఉదయం 8.36 గంటలకు శ్రీజగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠాధిపతి విద్యాశంకర భారతీ స్వామి చేతులమీదుగా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన చేపట్టనున్నట్లు వివరించారు. ముఖ్య అతిథులుగా మంత్రి కొండా సురేఖ, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హాజరవుతారని తెలిపారు.