అలీగఢ్, జూన్ 13: ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో జరిపిన ఒక కార్యక్రమంలో బీజేపీ మంత్రి దినేశ్ ప్రతాప్ సింగ్ మతపరమైన నినాదాలు చేసి సంచలనం సృష్టించారు. నరేంద్ర మోదీ 12 ఏండ్ల పాలన పూర్తి చేసుకున్న క్రమంలో శుక్రవారం రాష్ట్ర ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఒక సెమినార్లో ప్రసంగించిన మంత్రి జై శ్రీరామ్, నర పార్వతి పతయ్ హర్హర్ మహాదేవ్ అంటూ నినాదాలు చేస్తూ, అక్కడున్న వారితో చేయించారు. ‘అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలోని కెనడీ హాల్లో హరహర మహాదేవ్’ అనే క్యాప్షన్తో దానికి సంబంధించిన వీడియోను మంత్రి తన ఇన్స్టాలో షేర్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.