ఉదయ్పూర్: కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజస్థాన్లోని ఉదయ్పూర్లో చింతన్ శివిర్ సమావేశాలను నిర్వహిస్తోంది. పార్టీలో సంస్థాగత ప్రక్షాళన ఆశిస్తూ ఈ సమావేశాలు జరుగుతున్నాయి. మూడు రోజులు జరిగే ఈ భేటీలో అనేక కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అయితే కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నిబంధన విషయంలో గాంధీ కుటుంబానికి వెసలుబాటు కల్పించే అవకాశాలు ఉన్నాయి. పార్టీలో ఉన్న పదువులు, వయో పరిమితిపైన కూడా తమ ఎజెండాలో కాంగ్రెస్ పార్టీ చర్చించనున్నది. చింతన్ శివిర్లో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ ఉదయ్పూర్ చేరుకున్నారు.
ఏదైనా పదవిలో అయిదేళ్లు కొనసాగిన వాళ్లు ఆ పదవి నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ వెల్లడించారు. అయితే అదే పోస్టు కోసం పోటీ పడాలనుకునేవాళ్లు మూడు ఏళ్ల పాటు విరామం తీసుకోవాలని ఆయన అన్నారు. ఒకే పొజిషన్లో అయిదేళ్ల కన్నా ఎక్కువ సమయం ఎవరూ ఉండకూడదన్నారు. కుటుంబంలో ఒక్కరి కన్నా ఎక్కువ మందికి టికెట్ కేటాయించే అంశంలో ప్యానెల్ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు అజయ్ మాకెన్ తెలిపారు. ఒకవేళ ఒకరి కన్నా ఎక్కువ మందికి టికెట్ కావాలనుకుంటే, ఆ కుటుంబసభ్యులు అయిదేళ్ల కన్నా ఎక్కువ కాలం పాటు పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి ఉండాలని మాకెన్ అన్నారు.
చింతన్ శివిర్ను ఉద్దేశించి సోనియా గాంధీ ప్రసగించనున్నారు. మొత్తం 400 మంది కాంగ్రెస్ నేతలు ఈ భేటీలో పాల్గొంటున్నారు.