హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుపై కాంగ్రెస్ నేతలు గురువారం డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేశారు. పార్టీ సీనియర్ నాయకుడు తుమ్మేటి సమ్మిరెడ్డితో కలిసి టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్గౌడ్ డీజీపీకి వినతిపత్రం అందించారు. గత ప్రభుత్వ హయాంలో ఒకే సామాజికవర్గానికి చెందిన పోలీసు అధికారులు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారని పేర్కొన్నారు.
వారం తా ఒకే జిల్లాకు చెందినవారని తెలిపారు. ఈ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు కూడా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అవసరమైతే కేసును సీబీఐ, ఈడీ వంటి సంస్థలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. కొందరు ఇంటెలిజెన్స్ పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కోట్లాది రూపాయలు దోచుకున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ఫాంహౌస్లో జరిగిన అన్ని విషయాలను వెలికితీయాలని, చట్టవిరుద్ధంగా ట్యాపింగ్కు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని కోరారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన నందకుమార్ సైతం గురువారం డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేశారు. తన ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని వినతిపత్రం ఇచ్చా రు. ఎమ్మెల్యేల కొనుగోళ్లతో తనకు సంబంధం లేదని ఇన్నాళ్లూ చెప్పిన నందకుమార్ ఇప్పుడు ఎమ్మెల్యేలతో మాట్లాడిన మాటలు ట్యాపింగ్ చేసి విన్నారని చెప్పడం గమనార్హం.