Congress | కార్వాన్, మే 6: గాంధీభవన్లో సోమవారం నిర్వహించిన హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమావేశం రసాభాసగా జరిగింది. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జి, ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్అలీ పార్టీ అభ్యర్థి, నాయకులతో గాంధీభవన్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
కార్వాన్ నియోజకవర్గానికి చెందిన ఓ నాయకుడు మాట్లాడేందుకు యత్నించగా వాగ్వాదం చోటు చేసుకున్నది. ఈ సమయంలో తోపులాట జరిగి స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. ఐతే కార్వాన్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఉస్మాన్ బిన్ అల్ హజారీ తన కుమారుడిని వారించి అందరినీ సముదాయించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.