హైదరాబాద్: అదానీ వ్యవహారంలో కాంగ్రెస్ వైఖరి చూస్తుంటే ద్వంద్వ నీతి కూడా ఆత్మహత్య చేసుకుంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఓ వైపు ఢిల్లీ కాంగ్రెస్ ఏమో అదానీ సంస్థలు మోదీ జేబు సంస్థలంటూ ఆరోపణలు చేస్తుంటే.. మరోవైపు తెలంగాణ లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అదానీ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. ఇవ్వాళ అదే రేవంత్ రెడ్డి సహా మంత్రులు అదానీ సంస్థకు వ్యతిరేకంగా ఆందోళన చేయనున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఏమైనా స్ల్పిట్ పర్సనాలిటీ వ్యాధితో బాధపడుతున్నారా అని కేటీఆర్ ప్రశ్నించారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని రెడ్ కార్పెట్ వేసి మరీ అదానీని ఆహ్వానించిన రేవంత్ రెడ్డి నేడు నిరసన తెలపనుండటం ఈ ఏడాదిలోనే అతి పెద్ద జోక్ అని కేటీఆర్ అన్నారు. అదానీకి సంస్థలకు ప్రోత్సహాకాలు ఇచ్చి ఇప్పుడు అదే అదానీ మోసగాడని ఆరోపిస్తున్నారంటే కాంగ్రెస్ను ఏమనాలని ప్రశ్నించారు. ఇలాంటి డ్రామాలతో దేశాన్ని మోసం చేయగలమని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారా అన్నారు. గల్లీలో దోస్తీ.. ఢిల్లీలో కుస్తీ. ఇదీ కాంగ్రెస్ నీతి. దీనిపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పగలరా అంటూ కేటీఆర్ నిలదీశారు.
సెబీ చైర్పర్సన్ మాధబి పురి బచ్-అదానీ సంస్థలు కుమ్మక్కైనట్లు హిండెన్ బర్గ్ అనే అమెరికా సంస్థ చేసిన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీని ఆధారంగా ఈ వ్యవహారంపై జేపీసీ విచారణ చేయాలంటూ కాంగ్రెస్ నేడు దేశ వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. దీనిపై ట్విట్టర్ వేదికగా కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు.
Galli Mein Dosti
Dilli Mein KustiYeh Hi Hain Congress
Can you please explain @RahulGandhi Ji ? https://t.co/0gZqXgZWWo
— KTR (@KTRBRS) August 22, 2024