హైదరాబాద్ : కాంగ్రెస్లో ఆధిపత్యపోరు కొనసాగుతూనే ఉంది. సొంతపార్టీ నేతలపైనే ఒకరిపై ఒకరు విమర్శలు, భౌతిక దాడులకు పాల్పడటం ఆనవాయితీగా మారిపోయింది. తాజాగా ఎల్బీ నగర్లో (LB nagar) నిర్వహించిన సమావేశంలో మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ కార్యకర్తలు(Congress activists) తన్నుకున్నారు.
లింగోజిగూడ డివిజన్, చంపాపేట్ డివిజన్ కార్యకర్తల సమావేశంలో.. లింగోజిగూడ కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకంది. సునీత మహేందర్ రెడ్డి, మధుయాష్కి గౌడ్ స్టేజీపై ఉండగానే రాజశేఖర్ రెడ్డి, జక్కిడి ప్రభాకర్ రెడ్డి వర్గీయులు గొడవపడ్డారు. గొడవ సద్దుమనగకపోవడంతో సమావేశం మధ్యలో నుంచి సునీతా మహేందర్ రెడ్డి, మధుయాష్కి గౌడ్ వెళ్లిపోయారు.