హుజురాబాద్ : హుజురాబాద్ ఎన్నికలు నమ్మకానికి అమ్మకానికి మధ్య జరుగుతున్న పోరాటమని మంత్ర కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆదివారం జమ్మికుంటలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. హుజూరాబాద్ ఉప ఎన్ని క మనమీద బలవంతంగా రుద్దబడింది. ఐదేళ్లు అధికారంలో ఉండి సేవ చేయమని ఓటేస్తే.. ఈటల పార్టీని, ప్రజలను విడిచి పోయిండు. కన్నతల్లిలాంటి పార్టీని, కన్నతండ్రిలాంటి కేసీఆర్కు నమ్మక ద్రోహం చేసిండు. అని ఆయన అన్నారు.
ఎస్సీ, బీసీ, మైనార్టీలకు వ్యతిరేక పార్టీ బీజేపీలో చేరిండు. నిన్నటిదాకా ఆ పార్టీని తిట్టిండు. ఆ పార్టీ చేసే తప్పిదాలను ఎండగట్టిండు. కేవలం తన ఆస్తుల రక్షణ కోసమే అందుల చేరిండు. నమ్మకాన్ని వమ్ము చేసిండు. ఆయన ఆత్మ గౌరవం ఎక్కడుందో.. చెప్పాలి. ఢిల్లీలో తాకట్టు పెట్టిండు అని ఈశ్వర్ అన్నారు. ఇగ బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టింది. ఉద్యోగాల్లేకుండా చేస్తంది. రిజర్వేషన్లకు ఎసరు పెడ్తంది.
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలు పెట్టిన నమ్మకాన్ని కాపాడుతోంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఉద్యమంలా చేస్తోది. జూరాబాద్ ఉప ఎన్నిక పోరు.. నమ్మకానికి, అమ్మకానికి మధ్య జరుగుతోంది. ప్రజలు ఎటు వైపు ఉంటరో..? ఆలోచించాలే..పనిచేస్తున్న సర్కారుకే పట్టంగట్టాలే. ఉద్యమకారుడు, గరీబు బిడ్డ గెల్లు శ్రీనునే గెలిపించాలే..’ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ విజ్ఞప్తి చేశారు.
గెల్లు ప్రచారం…
ఆదివారం టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ జమ్మికుంట పట్టణంలోని 12, 15, 16, 21, 22, 23, 24, 25, 29, 30 వార్డుల్లో ప్రచారం చేశారు. ప్రచార ర్యాలీ, రోడ్ షోను మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్య క్షుడు వినోద్కుమార్, ఎమ్మెల్యేలు నరేందర్, చందర్లు ప్రారంభించారు. ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణంలోని గణేశ్ నగర్లో, కేశవాపూర్, కృష్ణాకాలనీ, ఎంప్లాయిస్ కాలనీలో మాట్లాడారు.
పేదింటి బిడ్డను గెలుపించుకుందాం : కొ్ప్పుల ఈశ్వర్
పేదింటి బిడ్డను ఆదరించి అధిక మెజారిటీతో గెలిపించుకుందామని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆదివారం సాయంత్రం జమ్మికుంట పట్టణం తెలంగాణ చౌరస్తాలో కళాకారుడు సాయి చంద్ ఏర్పాటు చేసిన ధూంధాంకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఏడేండ్లలో ఎన్నో సంక్షేమాలు అందించిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు.
దేశంలోనే రాష్ట్రాన్ని నంబర్వన్గా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. అదే ఏడేళ్లలో బీజేపీ చేసింది ఏందో చెప్పాలని డిమాండ్ చేశారు. నిత్యావసర సరుకులు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్, పెట్రోల్, డిజీల్ ధరలు ఆకాశాన్నంటాయని దుయ్యబట్టారు. బీజేపీకి ఓ ఎజెండా లేదన్నారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని ఇచ్చిన హామీని గుర్తు చేశారు.
నవోదయ పాఠశాలలు జిల్లాకొక్కటి ఇయ్యాల్సి ఉండే.. ఒక్కటి కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఏం జూసి బీజేపీకి ఓటెయ్యాలో చెప్పాలన్నారు. వ్యక్తి ముఖ్యం కాదు..వ్యవస్థ ముఖ్యమని తెలిపారు. రాజకీయ ఓనమాలు నేర్పిన కేసీఆర్కు గోరీ కడుతానంటావా..? ఈటల, నీ ద్రోహానికి ప్రజలు ఓటు ద్వారా గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. పేదింటి బిడ్డను గెలిపించుకుందామని కోరారు.