న్యూఢిల్లీ: స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదనల అమలుపై ఇవాళ రాజ్యసభలో సభ్యులు ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రులు సమాధానం ఇచ్చారు. కనీస మద్దతు ధరపై కమిటీని ఏర్పాటు చేసేందుకు ఎన్నికల సంఘం అనుమతి కావాల్సి ఉంటుందని కేంద్ర వ్యవసాయ సహాయక మంత్రి కైలాశ్ చౌదరీ తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈసీ నియమావళి అమలులో ఉందని, ఎన్నికలు ముగిసిన తర్వాత ఎంఎస్పీపై కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఇదే అంశంపై కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కూడా స్పందించారు. రైతులు ఎటువంటి పంట పండించినా.. వారికి ఎంఎస్పీ దక్కడం న్యాయమైన డిమాండ్ అని అన్నారు. ఎంఎస్పీ ఏర్పాటుపై తాము కట్టుబడి ఉన్నామని ప్రధాని గతంలో హామీ ఇచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. ఎంఎస్పీ కమిటీకి తాము సిద్దం అయ్యాయని, కానీ ఎన్నికల వల్ల ఆలస్యం అవుతోందన్నారు. ఎంఎస్పీ కమిటీ ఏర్పాటు కోసం అనుమతి ఇవ్వాలంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు ఆయన చెప్పారు.