చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో ఇవాళ ఓ కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. శ్రీలంకకు నిత్యావసర వస్తువులు పంపించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆ తీర్మానంలో కోరారు. ఈ తీర్మానాన్ని సీఎం స్టాలిన్ ప్రవేశపెట్టారు. దీనికి అన్ని పార్టీలు మద్దుతు ఇవ్వాలని ఆయన కోరారు. శ్రీలంకలో తీవ్ర దుర్భర పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఆర్థికం సంక్షోభంతో సతమతం అవుతున్న ఆ దేశానికి బియ్యం, పప్పులు, పాల ఉత్పత్తులు, మందులు లాంటి నిత్యావసర వస్తువుల్ని పంపేందుకు తమిళనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్టాలిన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం దక్కింది.