మహబూబ్ నగర్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) బహిరంగ సభ అట్టర్ ఫ్లాప్( Utter Flop ) అయ్యింది . ఎంతో ఘనంగా నిర్వహించాలని భావించిన కాంగ్రెస్ శ్రేణులు జన సమీకరణలో విఫలమయ్యారు. దీంతో మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్( Midjil ) లో శనివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభకు జనాలు రాక ఆ ప్రాంతమంతా బోసిపోయింది. కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి.

రేవంత్రెడ్డి జడ్పీటీసీగా రాజకీయ ప్రస్తానం ప్రారంభించిన మిడ్జిల్లో సభను ఎంతో అట్టహసంగా నిర్వహించాలని భావించినప్పటికీ సభ తుస్సు మంది. బందోబస్తుకు వచ్చిన పోలీసులు, అధికారులే సభలో ఎక్కువ సంఖ్యలో కనిపించారు.