ఇంద్రవెల్లి : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన ఎనిమిది మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ( CM Relief Fund ) ద్వారా మంజూరైన చెక్కులను ఏఎంసీ చైర్మన్ ముకాడే ఉత్తమ్ బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను ఆర్థికంగా ఆదుకోవాలని ఉద్దేశంతో ప్రభుత్వం వివిధ రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు.
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎండి జహీర్ , నాయకులు మెస్రం నాగ్ నాథ్, జితేందర్, సుంకట్ రావ్, సోమసే కిషోర్ కుమార్, కినక జుగాదిరావ్, సోన్ కాంబ్లే మనోహర్, వాగ్మారే కామ్ రాజ్, రాజేశ్వర్, హూషార్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.