CM KCR | తెలంగాణ ఈ సెప్టెంబర్ 17 నాటికి 75 సంవత్సరాల్లోకి అడుగిడుతున్నది. ఈ నేపథ్యంలో 2022 సెప్టెంబర్ 17 ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’గా పాటించాలని కేబినెట్ నిర్ణయించిన విషయం విధితమే. సెప్టెంబర్ 16, 17, 18 తేదీల్లో మూడు రోజుల పాటు వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా 17న పబ్లిక్ గార్డెన్స్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.
అనంతరం నెక్లెస్ రోడ్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు భారీ ఊరేగింపు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా దినంలో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు జెండాలను ఎగుర వేస్తారు. 18న అన్ని జిల్లా కేంద్రాల్లో స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించనున్నారు. తెలంగాణ స్ఫూర్తిని చాటాలే సాంస్కృతిక కార్యక్రమాలను సైతం నిర్వహించనున్నారు. అలాగే ఈ నెల 17న బంజారా, ఆదివాసీ భవన్కు ప్రారంభోత్సవం చేయనున్నారు.