హైదరాబాద్ : ఈ నెల 7 నుంచి 16వ తేదీ వరకు వరంగల్ నగరంలోని భద్రకాళీ దేవాలయంలో శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగనున్నాయి. ఈ మేరకు మహోత్సవాల పోస్టర్ను సీఎం కేసీఆర్ మంగళవారం ప్రగతిభవన్లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, భద్రకాళీ ఆలయ అర్చకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎంను ఆలయ అర్చకులు శాలువాతో సత్కరించి, అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.