పెద్దపల్లి : తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి సింగరేణి (Singareni) ని అన్ని విధాల ఆదుకుంటున్న సీఎం కేసీఆర్(CM KCR) కాంట్రాక్టు కార్మికులకు సైతం అండగా నిలుస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే (Ramagundam Mla) కోరుకంటి చందర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే నివాసంలో గురువారం తెలంగాణ సింగరేణి కాంట్రాక్టు కార్మికులు బీఆర్ఎస్(BRS) పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్(CM KCR) ప్రతి ఇంటికి సంక్షేమం ప్రతి ముఖంలో ఆనందం నింపుతూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని వెల్లడించారు. సింగరేణి సంస్థలో కార్మికుల వారసులకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు.
సింగరేణి సంస్థలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షుడు మడ్డీ శ్రీనివాస్, నాయకులు చంద్రమౌళి దొమ్మేటి వాసు పాల్గొన్నారు. తీన్మార్ మల్లన్న టీం నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో సాయి సురేష్, విజయ్, రాకేష్ ,రవి కిరణ్, సాయి తదితరులు ఉన్నారు.