హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేదర్ 131వ జయంతిని పురసరించుకొని గురువారం ప్రగతిభవన్లో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మోతుపల్లి నర్సింహులు, ఎంపీ సంతోష్కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, నవీన్కుమార్, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, సీఎం సెక్రటరీ రాజశేఖర్రెడ్డి, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి వేడుకలు తెలంగాణ భవన్లో ఘనంగా జరిగాయి. గురువారం మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, ఎస్టీ విభాగం నాయకుడు, పార్టీ కార్యదర్శి ఎల్ రూప్సింగ్ తదితరులు నివాళి అర్పించారు.
జైనుల ఆరాధ్య దైవం వర్ధమాన మహావీరుడి జయంతి సందర్భంగా గురువారం సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మహావీరుడు తన బోధనల ద్వారా భారత సమాజానికి సరికొత్త జవసత్వాలను అందించాడని సీఎం పేర్కొన్నారు. క్రమశిక్షణతో కూడిన జీవనానికి మహావీరుడి ప్రవచనాలు ఎంతగానో దోహదపడుతాయని చెప్పారు.