హైదరాబాద్: సీనియర్ జర్నలిస్ట్ మెండు శ్రీనివాస్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. శ్రీనివాస్ మృతి అత్యంత బాధాకరమన్నారు. జర్నలిస్టుగా ఆయన సేవలను ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సీనియర్ జర్నలిస్ట్ మెండు శ్రీనివాస్ తన స్వగ్రామం పరకాలలో తుదిశ్వాస విడిచారు. ఆదివారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో స్థానిక దవాఖానలో చేరారు. అయితే చికిత్స పొందుతూ చనిపోయారు. వరంగల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ ప్రస్తుతం ఆంధ్రజ్యోతి స్టేట్ బ్యూరోచీఫ్గా పనిచేస్తున్నారు.
మెండు శ్రీనివాస్ మృతిపట్ల మంత్రి కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తెలుగు మీడియా ఒక మంచి జర్నలిస్టును కోల్పోయిందని చెప్పారు. శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆంకాంక్షించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.