హైదరాబాద్ : ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే మాచర్ల జగన్నాథం గౌడ్ అనారోగ్యంతో కన్నుమూశారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్లో ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంతాపం ప్రకటించారు. జగన్నాథం కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. అలాగే మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. జగన్నాథం 1978లో జనతా పార్టీ నుంచి వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు.