గ్రానడా (స్పెయిన్) : ఐఎస్ఎస్ఎఫ్ రైఫిల్, పిస్టల్ షూటింగ్ వరల్డ్ కప్లో తొలిరోజే పసిడి పతకంతో బోణీ కొట్టిన భారత్కు రెండో రోజు నిరాశ ఎదురైంది. పురుషుల పది మీటర్ల ఎయిర్పిస్టల్ క్వాలిఫికేషన్ బరిలో నిలిచిన ముగ్గురు షూటర్లు.. టాప్-8 ర్యాంకును దక్కించుకున్నవారు పాల్గొనే ఫైనల్కు అర్హత సాధించడంలో విఫలమయ్యారు.
మంగళవారం జరిగిన మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో పాలక్తో కలిసి స్వర్ణం గెలిచిన ఆంధ్రప్రదేశ్ కుర్రాడు ముకేశ్.. అర్హత రౌండ్లలో 579 పాయింట్లు స్కోరు చేసి 14వ స్థానంలో నిలిచాడు. భరద్వాజ్ ఆకాశ్ పదో స్థానం (580), మాలిక్ ఉజ్వల్ (577) 22వ స్థానంలో నిలిచాడు.