న్యూఢిల్లీ: సీఎం కేసీఆర్తో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సమావేశం ముసింది. రెండున్నర గంటలపాటు కొనసాగిన ఈ సమావేశంలో ఇరువురు నేతలు పలు జాతీయ అంశాలపై చర్చించుకున్నారు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై చర్చించినట్లు సమాచారం.
దేశంలో ప్రత్యామ్నాయ ఎజెండా రూపకల్పన దిశగా ప్రయత్నాలు ప్రారంభించిన సీఎం కేసీఆర్.. అఖిలేశ్ యాదవ్తో భేటీ అయ్యారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఢిల్లీలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న ఆయనకు ముఖ్యమంత్రి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు సంతోష్ కుమార్, నామా నాగేశ్వర రావు, రంజిత్ రెడ్డి, వెంకటేష్ నేత పాల్గొన్నారు.