రవీంద్రభారతి, మార్చి 25: కుల సంఘాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని మంత్రి గుంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం రవీంద్రభారతిలో మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు ప్రతినిధులను మంత్రి గంగులతో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్ ఘనంగా సన్మానించారు. అనంతరం మంత్రి గంగుల మాట్లాడుతూ ఆత్మగౌరవ భవనాలకు 5 ఎకరాల చొప్పున కేటాయించిన సీఎం కేసీఆర్ కాపుల సంక్షేమానికి కృషిచేస్తున్నారని తెలిపారు. మున్నూరు కాపులు ఐక్యంగా ఉండి రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాలలో రాణించాలని కోరారు. అనంతరం తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం డైరీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అపెక్స్ కమిటీ చైర్మన్ వద్దిరాజు రవిచంద్ర, డా కొండ దేవయ్యపటేల్, చల్లా హరిశంకర్, విఠల్, తోట ఆగయ్య పాల్గొన్నారు.