అబిడ్స్: రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పుట్టినరోజు పురస్కరించుకుని ప్రతి ఏడాది మాదిరిగా కేసీఆర్ సేవాదళం ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి 16 వరకు ఈ టోర్నీ జరుగనుంది. దీనికి సంబంధించి గురువారం బషీర్బాగ్లోని టీఎస్ఐఐసీ భవన్లో సీఎం కేసీఆర్ క్రికెట్ టోర్నీ ట్రోఫీలతో పాటు పోస్టర్ను చైర్మన్ గ్యాదరి బాలమల్లు, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రభాకర్, ఆర్టీఐ కమిషనర్ మహమ్మద్ అమీర్, రఫత్ తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ సేవాదళం రాష్ట్ర అధ్యక్షుడు రఫత్ మాట్లాడుతూ టోర్నీలో పాల్గొనే వారు ఈనెల 31లోపు బాబుఖాన్ ఎస్టేట్లోని తమ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. టోర్నీలో విజేతకు లక్ష రూపాయలు, రన్నరప్ జట్టుకు రూ.50 వేలు అందిస్తామని పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఈ ఫోన్ నంబర్లలో 9396261699, 6302457876 సంప్రదించాలని కోరారు.