దేవరాజు, తగుళ్లకు సీఎం శుభాకాంక్షలు
హైదరాబాద్, డిసెంబర్ 30: ముగ్గురు తెలంగాణ బిడ్డలు.. ప్రముఖ కవి గోరటి వెంకన్న, ప్రముఖ రచయితలు దేవరాజు మహారాజు, తగుళ్ల గోపాల్కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ప్రకటించడం ఆనందంగా ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. సాహిత్యానికి సంబంధించిన మూడు విభాగాల్లో తెలంగాణకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అభించడం, తెలంగాణ సాహితీ గరిమను ప్రపంచానికి చాటిందని పేర్కొన్నారు.
తెలంగాణ మట్టి మనిషికి గౌరవం
గోరటి వెంకన్న రచించిన వల్లంకి తాళం కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దకడం గొప్ప విషయమని సీఎం కేసీఆర్ అన్నారు. దైనందిన జీవితంలోని ప్రజా సమస్యలను సామాజిక తాత్వికతతో కండ్లకు కడుతూ వెంకన్న అందించిన సాహిత్యం ప్రపంచ మానవుడి వేదనకు అద్దం పడుతుందని ప్రశంసించారు. మానవ జీవితానికి, ప్రకృతికి ఉన్న అవినాభావ సంబంధాన్ని.. మనిషికి ఇతర జీవాలకు ఉన్న అనుబంధాన్ని గోరటి.. అత్యున్నతంగా ఆవిషరించారన్నారు. తెలంగాణ మట్టి వాసనలను తన సాహిత్యం ద్వారా విశ్వవ్యాప్తంచేశారని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో కవిగా గొప్ప పాత్ర పోషించారని తెలిపారు. గోరటి సాహిత్యానికి దకిన ప్రతిష్ఠాత్మక సాహితీ గౌరవం, తెలంగాణ మట్టి మనిషి జీవన తాత్వికతకు దకిన గౌరవంగా సీఎం పేరొన్నారు.