హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ)/శంషాబాద్: రెండు తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కే చంద్రశేఖర్రావు, వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ఒకే వేదిక మీద కలుసుకొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి మనువరాలు స్నిగ్ధ్నారెడ్డి వివాహం ఏపీ సీఎం జగన్మోహ న్రెడ్డి వద్ద ప్రత్యేకాధికారిగా పనిచేస్తున్న కృష్ణమోహన్రెడ్డి కుమారుడు రోహిత్రెడ్డితో జరిగింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని వీఎన్ఆర్ ఫామ్స్లో ఆదివారం నిర్వహించిన ఈ వివాహ వేడుకకు హాజరైన ఇద్దరు ముఖ్యమంత్రులు పక్కపక్కనే కూర్చొని ముచ్చటించుకోవటం, కలిసి వెళ్లి కొత్త జంటను ఆశీర్వదించి, గ్రూపు ఫొటో దిగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ వివాహ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్తోపాటు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్, ఒడిశా స్పీకర్ నారాయణ పాత్రో, తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, మంత్రులు మహమూద్ అలీ, హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, వేముల ప్రశాంత్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, ఎంపీ కే కేశవరావు, ఏపీ ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్నినాని, కన్నబాబు, అవంతి శ్రీనివాస్, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, అనిల్కుమార్యాదవ్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, వైఎస్ విజయమ్మ తదితరులు హాజరై, వధూవరులను ఆశీర్వదించారు.