జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్
మనోహరాబాద్, డిసెంబర్ 29 ః సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని, రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతుబంధును ఎట్టిపరిస్థితుల్లో ఆపరని జడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్ అన్నారు. ఎనిమిదవ విడుత రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమఅవడంతో మనోహరాబాద్లో రైతుబంధు మండల కో ఆర్డినేటర్ యాంజాల సుధాకర్రెడ్డి ఆధ్వర్యంలో రైతులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఆమె మాట్లాడుతూ.. రైతుబిడ్డ అయిన సీఎం కేసీఆర్కు రైతుల కష్టాలు తెలుసుకాబట్టే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అనేక పథకాలను ప్రవేశపెట్టారన్నారు. శివ్వంపేట మండల కేంద్రంలో రైతులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు రమణగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మ న్ చంద్రాగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, వైస్ చైర్మ న్ వేణుగోపాల్రెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.