సంగారెడ్డి : చైనా మాంజా మరో ప్రాణం తీసింది. సంగారెడ్డి జిల్లా ఫసల్వాది గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మాంజా గొంతుకు తగలడంతో తెగి ఓ వ్యక్తి మృతిచెందారు. మృతుడు ఉత్తర్ ప్రదేశ్కి చెందిన అవిదేశ్ (35) గా గుర్తించారు.
బైక్ మీద వెళ్తున్న అవిదేశ్కు చైనా మాంజా తగలడంతో మెడ తెగిపోయింది. దాంతో తీవ్ర రక్తస్రావం జరిగి ప్రాణాలు కోల్పోయాడు. అవిదేశ్ నిన్ననే యూపీ నుంచి కూలీ పని కోసం సంగారెడ్డికి వచ్చినట్లు తెలిసింది.