హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): యాసంగి వడ్లను రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించటంతో ఢిల్లీలోని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బుధవారం సంబురాలు చేసుకొన్నారు. సీఎం సహా ప్రజాప్రతినిధులు నిరసన దీక్ష చేపట్టిన తెలంగాణ భవన్ ప్రాంగణంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రాష్ట్రంలో ఎన్నటికైనా రైతులకు అండగా ఉండేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని, బీజేపీ, కాంగ్రెస్లను నమ్ముకొంటే రైతులే కాదు రాష్ట్రంలోని అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతాయని టీఆర్ఎస్ శ్రేణులు పేర్కొన్నాయి.